ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్

national |  Suryaa Desk  | Published : Sun, Mar 06, 2022, 01:30 PM

తమ ఖాతాదారులకు దేశంలోని అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్‌బీఐ హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవల కేటుగాళ్లు పలు మోసాలకు పాల్పడుతున్న తరుణంలో తాజా ప్రకటన విడుదలైంది. కేవైసీ అప్ డేట్ చేయాలని, లేకుంటే ఖాతా రద్దవుతుందనే సమాచారం ఎస్ఎంఎస్ రూపంలో వస్తోందన్నారు. ఎవరైనా దానిపై క్లిక్ చేస్తే ఖాతాలో ఉన్న డబ్బులన్నీ మాయమవుతాయని ఎస్‌బీఐ పేర్కొంది. దేశ్యాప్తంగా ఉన్న తమ 44 కోట్ల మంది కస్టమర్లు దీనిని గమనించాలని కోరింది. లింక్‌లు పంపి కేవైసీని అప్ డేట్ చేయాలని ఎస్‌బీఐ ఎప్పుడూ కోరదని తెలిపింది. కేటుగాళ్ల వలలో చిక్కొద్దని, వారు పంపిన లింకులను క్లిక్ చేయొద్దని సూచించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa