ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సచిన్ ‌రికార్డును సమం చేసిన మిథాలీ రాజ్

national |  Suryaa Desk  | Published : Sun, Mar 06, 2022, 01:32 PM

భారతదేశంలో రెండు దశాబ్దాలకు పైగా క్రికెట్ ఆడుతున్న మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్. భారత్ తరుపున ప్రపంచ క్రికెట్‌లో ఎన్నో రికార్టులను ఆమె సృష్టించింది. తాజాగా సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేసింది. ఆదివారం పాకిస్తాన్‌తో ఆడుతున్న మ్యాచ్‌తో ఆరు ప్రపంచ కప్‌లు ఆడిన మహిళా క్రికెటర్‌గా నిలిచింది. దీంతో సచిన్ సాధించిన రికార్డు సరసన చేరింది. 1997వ సంవత్సరంలో కేవలం 14 ఏళ్ల వయసులో ప్రపంచ కప్‌లో మిథాలీ పాల్గొంది. అయితే ఆమెకు తుది జట్టులో అప్పుడు చోటు దక్కలేదు. 2000వ సంవత్సరంలో న్యూజిలాండ్‌లో నిర్వహించిన ప్రపంచ కప్‌‌లో ఆమె పాల్గొంది. మూడు మ్యాచ్‌ల్లో 76.00 సగటుతో 152 పరుగులు చేసింది. దీని తరువాత, ఆమె 2005 ప్రపంచ కప్‌లో జట్టుకు కెప్టెన్‌ హోదాలో పాల్గొంది. గత 22 సంవత్సరాలలో ఆమె ఐదు ప్రపంచ కప్‌లు ఆడింది. ప్రపంచకప్‌ మ్యాచ్‌లలో మిథాలీ 54.23 సగటుతో 1139 పరుగులు చేసింది. 2005, 2017 సంవత్సరాల్లో ఆమె నాయకత్వంలో భారత్ రన్నరప్‌గా నిలిచింది. తాజాగా ఆదివారం పాకిస్తాన్‌తో 9 పరుగులకే పెవిలియన్‌కు చేరింది. అయితే ఎలాగైనా ఈ సారి ప్రపంచకప్ సాధించి, వీడ్కోలు పలకాలని ఆమె కోరుకుంటోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa