ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రపంచ దేశాలకు పుతిన్ హెచ్చరిక

international |  Suryaa Desk  | Published : Sun, Mar 06, 2022, 01:46 PM

ఉక్రెయిన్‌తో యుద్ధంలో ఎదురు దెబ్బలు తట్టుకోలేని రష్యా దాడులు ముమ్మరం చేసింది. ఉక్రెయిన్ దేశంలోని నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఎంతో అందమైన ప్రదేశాలను స్మశానంలా మారుస్తోంది. ఈ క్రమంలో తమ గగనతలాన్ని నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలని ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీ యూరోపియన్ దేశాలను కోరారు. దీనిపై పుతిన్ ఘాటుగా స్పందించారు. ఏ దేశమైనా అలా చేస్తే రష్యాపై యుద్ధం ప్రకటించినట్లేనని తీవ్రంగా హెచ్చరించారు. శనివారం 5 గంటల పాటు కాల్పల విరామం ప్రకటించిన రష్యా అనంతరం బాంబుల మోతతో విరుచుకుపడుతోంది. ఆదివారం కూడా క్షిపణులు, రాకెట్లు, బాంబుల దాడితో ఉక్రెయిన్‌ను భయాందోళనకు గురి చేస్తోంది. ఈ దాడుల కారణంగా సామాన్య ప్రజలు చనిపోతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే పదుల సంఖ్యలో చిన్నారులు కూడా కన్ను మూశారు. ఈ రెండు దేశాల మధ్య సామరస్యక వాతావరణం ఏర్పడి యుద్ధం ముగియాలని ప్రపంచ దేశాలు ఆకాంక్షిస్తున్నాయి.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa