విశాఖలో రాజధాని నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖుల నుండే భారీ స్పందన లభిస్తోంది. మరీ ముఖ్యంగా విశాఖను పరిపాలనా రాజధానిని చేస్తామని సీఎం జగన్ చెప్పడాన్ని టాలీవుడ్ ప్రముఖులు అందరూ స్వాగతిస్తున్నారు. ఆలా స్వాగతిచ్చిన వారిలో టాలీవుడ్ పెద్ద, మెగాస్టార్ చిరంజీవి ఏ మొదటివారు. జగన్ నిర్ణయం అభివృద్ధికి బాటలు వేస్తుందని మెగా స్టార్ చిరంజీవి పేర్కొన్నారు. ఇంతకాలం వెనకబాటుతనంలో అనేక ప్రాంతాలు ఇబ్బందులు పడ్డాయని, వాటికి సరైన మార్గం పాలనపరమైన వికేంద్రీకరణేనని ఆయన జగన్ కి పూర్తి మద్దతుగా మాట్లాడారు.
ఈ నిర్ణయం తో టాలీవుడ్ పంట పండినట్లేనని అంటున్నారు కొందరు ప్రముఖులు. అప్పట్లో రాజధాని విశాఖ అని చెప్పడంతో విశాఖ బీచ్ రోడ్ ని ఆనుకుని ఉన్న భూములను పెద్ద ఎత్తున కొన్నారు. ఆ భూములలో స్టూడియోలు కట్టాలని కూడా చాలా ఆలోచనలు చేశారు. విశాఖకు ప్రాధాన్యం తగ్గిపోవటం.. అనుకోని రీతిలో అమరావతి రాజధాని అవ్వడం అన్ని ఆలా జరిగిపోయాయి. అయితే ఇప్పుడు విశాఖకే రాజధాని రావడంతో ముందుగా మేలు జరిగేది టాలీవుడ్ కేనని అంటున్నారు ప్రముఖులు. ఇక ఇక్కడ స్టూడియోలు కడతారా, సినీ పరిశ్రమను అభివృద్ధి చేస్తారా అన్నది ప్రభుత్వ విధానం బట్టి ఉంటుంది. ఏది ఏమైనా జగన్ ప్రభుత్వం తీసుకున్న ఈ కీలక నిర్ణయం వల్ల టాలీవుడ్ పంట పండిందని అంటున్నారు సినీ ప్రముఖులు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa