హిట్టయిన ఓ చిత్రానికి సీక్వెల్ చేయడం అన్నది ఇటీవలి కాలంలో మనం అప్పుడప్పుడు చూస్తూనే వున్నాం. మొదటి చిత్రంలో నటించిన తారలతోనే చాలావరకు ఈ సీక్వెల్స్ ను నిర్మిస్తుంటారు. ఇక విషయానికి వస్తే, ఆమధ్య నయనతార కథానాయికగా తమిళంలో వచ్చిన 'ఆరమ్' (తెలుగులో 'కర్తవ్యం' పేరిట అనువదించారు) చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీంతో ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ చేస్తున్నారంటూ ఇటీవల వార్తలొచ్చాయి. అయితే, నయనతార డేట్స్ ఇవ్వకపోవడంతో ఆ పాత్రకు కీర్తి సురేశ్ ని తీసుకున్నారని కూడా తమిళ చిత్రసీమలో ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో 'ఆరమ్' చిత్ర దర్శకుడు గోపీ నైనర్ దీనిపై వివరణ ఇచ్చారు. 'ఈ చిత్రంపై ప్రస్తుతం వస్తున్నవన్నీ కేవలం రూమర్లు, వీటిని నమ్మకండి' అన్నారాయన. 'అసలు ఆరమ్ సీక్వెల్ ప్రయత్నాలే చేయడం లేదు. ఒకవేళ సీక్వెల్ అంటూ చేస్తే కనుక నయనతారతోనే చేస్తాను. ఆమె మాత్రమే ఆ కథకు సరిగ్గా సూట్ అవుతుంది. ప్రస్తుతానికి మాత్రం ఆ ప్రయత్నాలు జరగడం లేదు' అంటూ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa