నలభైకి పైగా తమిళ, కన్నడ చిత్రాల్లో నటించిన నటి విజయలక్ష్మి ఆదివారం ఆత్మహత్యాయత్నం చేశారు. 'నామ్ తమిళర్' పార్టీ అభిమానులు తనను వేధిస్తున్నారని.. ఆ పార్టీ అధినేత సీమాన్ తనను మానసికంగా హింసిస్తున్నారని ఆమె సామాజిక మాధ్యమాల్లో ఆరోపించారు. అంతేకాకుండా తనను వేధింపులకు గురిచేసిన సీమాన్, 'పనంకట్టు పడై' పార్టీకి చెందిన మరో ప్రముఖ నేత హరి నాడార్లను అరెస్టు చేయాలని ఆమె కోరారు. సీమాన్ సోషల్ మీడియా ద్వారా కూడా తన ప్రతిష్టకు నష్టం కలిగేలా వ్యాఖ్యానించారని విజయలక్ష్మి తెలిపారు. కాగా, కడపటి వార్తలు అందేసరికి నటిని చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
ఈ మేరకు నటి ఫేస్బుక్లో ఓ వీడియో విడుదల చేశారు. దీనిలో ఆమె మాట్లాడుతూ ''ఇది నా చివరి వీడియో. గత నాలుగు నెలలుగా నేను సీమాన్, అతని పార్టీ సభ్యుల వేధింపుల కారణంగా చాలా ఒత్తిడికి గురైతున్నాను. హరి నాడార్ మీడియాలో నన్ను అవమానించారు. అయినా మా అమ్మ, చెల్లి కోసం బతికి ఉండాలని నా శక్తి మేరకు ప్రయత్నించాను. నేను బీపీ మాత్రలను వేసేసుకున్నాను. కొద్దిసేపట్లో నా బీపీ పడిపోయి, నేను చనిపోతాను.'' అని చెప్తున్న వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. తను ఇక ఎంతమాత్రం బానిసగా బతకలేనని, తన మరణం ప్రతి ఒక్కరికీ కనువిప్పు కావాలని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, సీమాన్ ఈ కేసు నుంచి తప్పించుకు పోకుండా చూడాలని తన అభిమానులకు నటి విజ్ఞప్తి చేశారు.
కర్ణాటకకు చెందిన విజయలక్ష్మి సుమారు 40 తమిళ, కన్నడ చిత్రాల్లో.. పలు టీవీ సీరియళ్లలో నటించారు. తన తొలిచిత్రం 'నాగమండల'లో ప్రకాష్రాజ్ సరసన నటించిన ఈమెకు ఫిలింఫేర్ ఉత్తమనటి అవార్డు లభించింది. చివరిగా 2018లో 'ఫైటర్' అనే కన్నడ చిత్రంలో కనిపించారు. ఇక తెలుగులో 'హనుమాన్ జంక్షన్' చిత్రంలోనూ, 'సూర్యవంశం' అనే టీవీ సీరియల్లో కూడా కనిపించారు. సీమాన్పై ఆరోపణలు విజయలక్ష్మికి తొలిసారి కాదు. తనను వివాహం చేసుకుంటానని మోసం చేశారని ఆరోపిస్తూ, ఈమె ఫిబ్రవరిలో ఆత్మహత్యకు ప్రయత్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa