ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ వార్తల్లో ఎలాంటి నిజమూ లేదు : మాధవన్

cinema |  Suryaa Desk  | Published : Thu, Oct 01, 2020, 01:21 PM

అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం `పుష్ప`. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ ఎర్రచందనం దుంగల స్మగ్లర్‌గా కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం ముందుగా తమిళ ప్రముఖ నటుడు విజయ్ సేతుపతిని సంప్రదించారు. అయితే బిజీ షెడ్యూల్ కారణంగా ఆయన సినిమా నుంచి తప్పుకున్నాడు. 


విజయ్ తప్పుకోవడంతో విలన్ పాత్ర కోసం ప్రముఖ నటుడు మాధవన్‌ను సంప్రదించినట్టు, ఆయన అంగీకరించినట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై తాజాగా మాధవన్ స్పందించాడు. `పుష్ప` సినిమాల్లో తను నటిస్తున్నట్టు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజమూ లేదని స్పష్టం చేశాడు. దీంతో ఈ సినిమాలో విలన్‌గా ఎవరు కనిపించబోతున్నారనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa