ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహేశ్‌-రాజమౌళి సినిమా నుంచి బిగ్ అప్‌డేట్

cinema |  Suryaa Desk  | Published : Tue, May 10, 2022, 07:05 PM

పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన 'సర్కారు వారి పాట' సినిమా మే 12న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్‌, పాటలకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో మహేష్ బాబు సినిమా చేయనున్నారు. అది పూర్తైన తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటించే సినిమా పట్టాలెక్కనుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత కే.విజయేంద్రప్రసాద్ ఈ సినిమాపై స్పందించారు. 2022 జనవరిలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా మహేష్ బాబు-రాజమౌళి కాంబినేషన్‌లో రానున్న సినిమాకు సంబంధించి పలు కీలక విషయాలను మీడియాతో పంచుకున్నారు.

మహేష్ బాబు-రాజమౌళి సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథ అందించనున్నారు. దీనికి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ శరవేగంగా జరుగుతున్నట్లు ఆయన చెప్పారు. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు చేయబోయే సినిమాను దుర్గా ఆర్ట్స్‌ పతాకంపై కేఎల్‌ నారాయణ నిర్మించనున్నారు. ఇటీవలే ఈ సినిమా గురించి మహేష్ బాబు కూడా స్పందించారు. రాజమౌళితో కలిసి పని చేయడానికి చాలా ఆసక్తితో ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa