ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కిరణ్ అబ్బవరం సరసన డిజె.టిల్లు ఫేమ్ నేహా శెట్టి

cinema |  Suryaa Desk  | Published : Thu, Jun 16, 2022, 11:22 AM

యస్.ఆర్.కళ్యాణ్ మండపం’ సినిమాతో హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘రూల్స్ రంజన్’. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి రతినం కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఎ.యం.రత్నం సమర్పణలో దివ్యాంగ్ లవానియా, వి.మురళీకృష్ణ సంయుక్తంగా స్టార్ లైట్ ఎంటర్‌టైన్మెంట్స్ ప్రై లిమిటెడ్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతోంది. టాలీవుడ్, బాలీవుడ్‌కి చెందిన పలువురు ప్రముఖ నటీనటులు పాల్గొనగా ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.


అయితే తాజాగా ఈ సినిమాకి హీరోయిన్ కూడా కన్ ఫార్మ్ అయ్యింది. ‘డి.జె.టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి కథానాయికగా నటించనుంది. ‘యస్.ఆర్.కళ్యాణ్ మండపం’తో కిరణ్ అబ్బవరం, ‘డి.జె.టిల్లు’ తో నేహా శెట్టి సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి ‘రూల్స్ రంజన్’ చిత్రంలో నటించనుండటంతో సినిమాకి పాజిటివ్ వైబ్రేషన్స్ నెలకొన్నాయి.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa