అక్కినేని హీరో సుశాంత్ "మా నీళ్ల ట్యాంక్" తో ఓటిటి డిబట్ చేస్తున్న విషయం తెలిసిందే. జూలై 15వ తేదీ నుండి ప్రముఖ జీ 5 ఓటిటిలో స్ట్రీమింగ్ కానున్న ఈ మూవీ నుండి ఇటీవలే టీజర్ విడుదలై ప్రేక్షకుల మెప్పును పొందింది. ఇందులో సుశాంత్ తెలంగాణ యాస మాట్లాడతారు. ఆయన భాష, యాటిట్యూడ్ ఈ సినిమాలో భిన్నంగా ప్రేక్షకులకు నచ్చేలా ఉంది.
తాజాగా ఈ మూవీ ట్రైలర్ పై మేకర్స్ ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు. వరస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ, పాన్ ఇండియా హీరోయిన్ అనే ట్యాగ్ తగిలించుకున్న టాలీవుడ్ టాప్ హీరోయిన్ పూజాహెగ్డే మా నీళ్ల ట్యాంక్ ట్రైలర్ ను ఈ రోజు సాయంత్రం విడుదల చేస్తారని తెలిపారు. ఈ మూవీని లక్ష్మి సౌజన్య డైరెక్ట్ చెయ్యగా, ప్రియా ఆనంద్ హీరోయిన్ గా నటించారు. కొల్లా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కొల్లా ప్రవీణ్ ఈ సినిమాను నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa