టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అక్కినేని నాగచైతన్య తన తదుపరి సినిమాని తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. కమర్షియల్ ఎంటర్టైనర్ ట్రాక్ లో రానున్న ఈ సినిమాకి టెంపరరీగా 'NC22' అనే టైటిల్ ని పెట్టారు. ఈ చిత్రంలో నాగచైతన్య సరసన బబ్లీ బ్యూటీ కృతి శెట్టి జోడిగా కనిపించనుంది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ చిత్రంలో సీనియర్ హీరో అరవింద్ స్వామి కీలక పాత్రలో కనిపించనున్నారు అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం గురించి మూవీ మేకర్స్ ఇంకా అధికారకంగా ప్రకటించలేదు. ఈ తెలుగు-తమిళ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మాస్ట్రో ఇళయరాజా, ఆయన తనయుడు, మ్యూజిక్ కంపోజర్ యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని టాలీవుడ్ నిర్మాణ సంస్థ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ నిర్మిస్తోంది.