కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ హీరోగా నటించిన సినిమా 'ప్రిన్స్'. ఈ సినిమాకి తెలుగు డైరెక్టర్ అనుదీప్ కేవీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో మరియా ర్యాబోషప్క హీరోయిన్ గా నటించింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకి సెన్సార్ బోర్డు యూ సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ సినిమా 2 గంటల 23 నిమిషాల రన్-టైమ్ను లాక్ చేసారు.ఈ సినిమాకి థమన్ సంగీతం అందించారు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కింది.ఈ సినిమా దీపావళి కానుకగా ఈనెల 21న రిలీజ్ కాబోతుంది.