కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన తదుపరి సినిమాని దర్శకుడు సిరుత్తై శివతో అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి టెంపరరీగా 'సూర్య 42' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. 2 భాగాలుగా రూపొందనున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ క్వీన్ దిశా పటానీ సూర్య సరసన జోడిగా నటిస్తుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా కొత్త షెడ్యూల్ అక్టోబర్ 26 నుండి చెన్నై మరియు పుదుచ్చేరిలో ప్రారంభిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ మాస్ ఎంటర్టైనర్కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా 10 భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ బ్యానర్లపై వంశీకృష్ణ, ప్రమోద్, కెఇ జ్ఞానవేల్రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.