ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కింగ్ నాగార్జున నటించిన 'ది ఘోస్ట్' సినిమా అక్టోబర్ 5, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల అయ్యింది. ఎగ్జిక్యూషన్లో సమస్యల కారణంగా ఈ సినిమా సినీ ప్రేమికులని ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్ఫ్లిక్స్ భారీ మొత్తానికి సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే.
తాజాగా ఇప్పుడు, ఈ చిత్రం నవంబర్ 2న ప్రీమియర్గా ప్రదర్శించబడుతుందని నెట్ఫ్లిక్స్ ప్రకటించింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో నాగార్జున, సోనాల్ చౌహాన్ ఇద్దరూ ఇంటర్పోల్ ఆఫీసర్స్గా కనిపించనున్నారు. బాలీవుడ్ యాక్టర్ మనీష్ చౌదరి ఈ చిత్రంలో విలన్గా నటిస్తున్నారు. గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్, శ్రీకాంత్ అయ్యంగార్ మరియు రవివర్మ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.
శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి మరియు నార్త్స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు నిర్మించిన ఈ చిత్రానికి ముఖేష్ జి. గణేష్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రానికి భరత్-సౌరభ్ సంగీతం అందించారు.