తెలుగు సినిమాలలో జోరు పెంచుతున్న కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రం "శబరి". తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమా రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతుంది.
తాజా సమాచారం ప్రకారం, శబరి షూటింగ్ పూర్తయ్యింది. ఈ మేరకు మేకర్స్ నుండి అఫీషియల్ పోస్టర్ కూడా విడుదలైంది. షూటింగ్ పూర్తి చేసుకున్న శబరి ఇకపై పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుని, వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది.
ఈ సినిమాని కొత్త దర్శకుడు అనిల్కట్జ్ అకా అనిల్ కుమార్ రూపొందిస్తున్నారు. మహా మూవీస్ బ్యానర్ పై మహేంద్రనాధ్ కొండ్ల నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మహర్షి కొండ్ల సమర్పిస్తున్నారు. గోపి సుందర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.