మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సంక్రాంతికి విడుదలైన 'వినయ విధేయ రామ' అనుకున్నంత విజయం సాధించని సంగతి తెలిసిందే. బీ, సీ సెంటర్లలో అద్భుతమైన కలెక్షన్లు వసూలు చేసిన ఈ సినిమా 'ఎ' సెంటర్లలో తన ప్రభావం చూపలేకపోయింది. తొంభై కోట్లకు అమ్ముడుపోయిన ఈ సినిమా రూ.65 కోట్లు సాధించి ఫరవాలేదనిపించింది.
ముఖ్యంగా ఈ చిత్ర పరాజయానికి ఎక్కువ నిందలు హీరో రామ్ చరణ్ కంటే దర్శకుడు బోయపాటి శ్రీను మోయాల్సి వచ్చింది. బోయపాటి సినిమాలంటేనే విపరీతమైన హింస, రక్తపాతం ఎక్కువ. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు వాస్తవాతీతంగా ఉండటంతో ఆ సీన్లను ప్రేక్షకులు దారుణంగా ట్రోల్ చేసి పడేశారు. ఈ సినిమా దెబ్బకు మెగాస్టార్ చిరంజీవితో సినిమా అవకాశాన్ని కూడా బోయపాటి పోగొట్టుకున్నాడు.
బోయపాటి సంగతి ఇలా ఉంటే.. ఈ సినిమా హిట్ సాధిస్తే టాలీవుడ్ లో తన జెండా గట్టిగా పాతొచ్చు అనుకుంది.. బాలీవుడ్ లస్ట్ సుందరి కియారా అద్వానీ. భారీ హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ప్రిన్స్ మహేశ్ బాబు హీరోగా వచ్చిన 'భరత్ అనే నేను' చిత్రంతో కియారా టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో వెంటనే 'వినయ విధేయ రామ' లో బుక్ అయ్యింది. ఈ సినిమా విజయం మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నప్పటికీ ఈ ముద్దుగుమ్మ ఆశ నెరవేరలేదు.
దీంతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రంలో, ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా వస్తున్న 'ఆర్ఆర్ఆర్'లో హీరోయిన్ గా అవకాశాలు కోల్పోయింది. బోయపాటి శ్రీను దెబ్బ కొట్టకపోయి ఉంటే ఈ రెండు ప్రతిష్టాత్మక చిత్రాల్లో అవకాశం కొట్టేసి టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా పాతుకుపోయేది. వినయ విధేయ రామ ప్లాప్ తో ప్రస్తుతానికి బాలీవుడ్ లోనే తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa