by Suryaa Desk | Wed, Oct 23, 2024, 12:45 PM
కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈనెల 28 నుండి కబడ్డీ పోటీలు జరగనున్నాయి. ఈ సందర్భంగా బుధవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ కబడ్డీ పోటీల ఏర్పాట్లను కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ పోటీలు ఈనెల 28, 29, 30 తేదీల్లో జరుగుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చంద్రశేఖర రావు, ఆళ్ళ మురళి, పెదబాబు తదితరులు పాల్గొన్నారు.