by Suryaa Desk | Wed, Oct 23, 2024, 01:57 PM
హాస్టల్ యాజమాన్యానికి తెలియకుండా స్నేహితులతో కలిసి బయటకు వెళ్ళడానికి కిటికీలో నుండి కిందకు దిగేందుకు ప్రయత్నించి 5వ అంతస్తు నుంచి జారిపడి విద్యార్థి మృతి చెందిన ఘటన మాదాపూర్లో చోటుచేసుకుంది. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరుకు చెందిన శివ కుమార్ రెడ్డి (17) మాదాపూర్ నారాయణ రెసిడెన్షియల్ కాలేజీ క్యాంపస్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం రాత్రి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించి 5వ అంతస్తు నుంచి జారి పడిపోయాడు.