by Suryaa Desk | Wed, Oct 23, 2024, 02:30 PM
వనపర్తి జిల్లా మదనాపురం మండలం అజ్జకొల్లు గ్రామంలో బుధవారం గ్యాస్ సిలిండర్లు సప్లై చేసే ఆటోలో తూనికలు, కొలతల శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ఆటోలో బరువు తూచే యంత్రాలు లేనందున గ్యాస్ ఏజెన్సీపై కేసు నమోదు చేసి రూ. 3000 జరిమానా విధించారు. సిలిండర్లు సప్లై చేసే వాహనాలలో తప్పనిసరిగా బరువు తూచే యంత్రాలు ఉండాలని, నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని తూనికలు, కొలతల శాఖ అధికారి సత్యనారాయణ హెచ్చరించారు.