by Suryaa Desk | Wed, Oct 23, 2024, 03:15 PM
పుల్కల్ మండల పరిధిలోని ఇటిక్యాల గ్రామంలోని ఎమ్మెస్ పరిశ్రమ ముందు బుధవారం మహిళా కార్మికులు ఆందోళనకు దిగారు. దసరా పండుగకు బోనస్ ప్రకటిస్తామని హామీ ఇచ్చిన యాజమాన్యం ఇప్పటి వరకు ఇవ్వలేదని మహిళా కార్మికులు ఆరోపించారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా కార్మికులు నినాదాలు చేశారు.