|
|
by Suryaa Desk | Sat, Nov 01, 2025, 05:09 PM
హైదరాబాద్లోని మియాపూర్లో ఐదంతస్తుల భారీ అక్రమ నిర్మాణాన్ని అధికారులు కూల్చివేస్తున్నారు. సర్వే నంబర్ 100లో నిబంధనలకు విరుద్ధంగా వెలిసిన ఈ కట్టడంపై చర్యలు తీసుకునేందుకు హైడ్రా ప్రత్యేక బృందాలు ఈ ఉదయం రంగంలోకి దిగాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆ ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు.వివరాల్లోకి వెళితే, మియాపూర్లోని సర్వే నంబర్ 100లో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కొందరు కబ్జా చేశారు. హెచ్ఎండీఏ ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ను తొలగించి మరీ భారీ నిర్మాణాన్ని చేపట్టారు. అంతేకాకుండా, అధికారులను తప్పుదోవ పట్టించేందుకు సర్వే నంబర్లను మార్చి ఈ అక్రమ నిర్మాణాన్ని కొనసాగించారు. ఈ వ్యవహారంపై స్థానికులు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు.ఫిర్యాదు స్వీకరించిన హైడ్రా, హెచ్ఎండీఏ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, నిర్మాణం అక్రమమైనదని నిర్ధారించుకున్నారు. ఈ క్రమంలో ఇవాళ ఉదయం ప్రత్యేక యంత్రాలతో కూల్చివేత పనులు ప్రారంభించారు.