కుడుదుల నవీన్ రెడ్డి అంటే.. ఎవరికీ తెలియకపోవచ్చు కానీ 'మిస్టర్ టీ' నవీన్ రెడ్డి అంటే మాత్రం చాలా మందికి వెంటనే గుర్తుకొస్తాడు. చిన్నవయసులోనే సక్సెస్ఫుల్ పారిశ్రామికవేత్తగా ఎదిగి చాలా మందికి ఇన్సిపిరేషన్గా నిలిచాడు. అయితే.. తాను ప్రేమించిన అమ్మాయికి తనతో కాదని వేరే వ్యక్తితో ఎంగేజ్ మెంట్ జరుగుతుందని తెలిసి.. సినిమా రేంజ్లో సుమారు 100 మందితో వెళ్లి.. ఇంటిపై దాడి చేయటం, ఆమెను కిడ్నాప్ చేయటం.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ సంచలనంగా మారింది. ఈ కేసులో నవీన్ గోవా పారిపోవటం.. అక్కడికి వెళ్లి మరీ పోలీసులు అతన్ని అరెస్ట్ చేయటం.. జైలుకు పంపించటం.. బెయిల్ మీద బయటికి రావటం.. ఈ ఎపిసోడ్ అంతా ఓ సినిమా స్టోరీని తలపించింది. కాగా.. ఇప్పుడు నవీన్ రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. హస్తినా పురంలో నవీన్ రెడ్డిపై కత్తులతో దాడి చేయటం ఒక కారణమైతే.. ఆయనకు ఇటీవలే పెళ్లి జరిగటం, అది కూడా ఒక సెలబ్రెటీతో జరగటం ఇప్పుడు చర్చకు తెరలేచింది.
అయితే.. బిజినెస్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడే ఇదంతా గందరగోళం జరగటంతో.. అతని ఫ్యూచర్ మొత్తం పోయింది అనుకున్నారంతా. మళ్లీ కోలుకోలేడు.. చేజేతులారా లైఫ్ పాడుచేసుకున్నాడు అంటూ వాపోయారు. అయితే.. తెలుగు సినిమాల్లో హీరోలా.. జీరోకు పడిపోయిన తన జీవితాన్ని మళ్లీ కొత్తగా రీస్టార్ట్ చేసి.. ముందుకంటే మెరుగైన స్థానానికి చేరుకోవాలన్న లక్ష్యంతో కష్టపడుతున్నాడు నవీన్ రెడ్డి. తన జీవితంలో జరిగిన చేదు ఘటనను మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఓ అమ్మాయి వల్లే తన జీవితంలో ఊహించని పరిణామాలు ఎదురుకాగా.. కొత్తగా ప్రారంభించిన ప్రయాణంలో తోడుగా నడుస్తానంటూ.. మరో అమ్మాయి జతైంది. తన గతాన్ని యాక్సెప్ట్ చేస్తూ.. ఫ్యూచర్ను అందంగా మార్చుకుందాం అంటూ ప్రేమగా చేయందించింది.
గత అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠమో.. తనను కోరి వచ్చిన ప్రేమను వదులుకోకూడదనుకున్నాడో మన మిస్టర్ టీ నవీన్ రెడ్డి.. ఈసారి దగ్గరైనా ఆ చేయిని వదలుకోకూడదని.. మూడు ముళ్లతో బంధంతో గట్టిగా ముడేసుకున్నాడు. 2024 ఫిబ్రవరి 29న మిస్టర్ టీ నవీన్ రెడ్డి ఓ ఇంటివాడయ్యాడు. అయితే.. నవీన్ రెడ్డిని పెళ్లి చేసుకున్న ఆ అమ్మాయి ఎవరో కాదు.. మనందరినీ బుల్లితెర ద్వారా నవ్విస్తున్న ముద్దుగుమ్మ శ్రీదేవి ఎర్రోజు. సోషల్ మీడియాను ఫాలో అయ్యేవారికి శ్రీదేవి ఎర్రోజు గురించి తెలిసే ఉంటుంది. ఈ ఉంగరాల జుట్టు బుట్టబొమ్మ శ్రీదేవి ఎర్రోజు.. కేవలం బుల్లితెర నటి మాత్రమే కాదండోయ్.. ఆమె టాలెంట్స్ గురించి తెలిస్తే అమ్మ బాబోయ్ అని నోరెళ్లబెట్టాల్సిందే.
శ్రీదేవి ఎర్రోజు నేపథ్యమిదే..
వరంగల్కు చెందిన శ్రీదేవి ఎర్రోజు కుటుంబం.. ఏళ్ల క్రితమే హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. ఐదుగురు అక్కాచెల్లెల్లు, ఒక అన్న ఉన్న కుటుంబంలో శ్రీదేవి చిన్నమ్మాయి. వృత్తిరిత్యా గోల్డ్ స్మిత్ అయిన తన తండ్రి.. పురోహితం కూడా చేసేవాడు. శ్రీశైలం, మంత్రాలయం ఆలయాల్లో పూజారిగా కూడా చేశారు. అనారోగ్య కారణాల వల్ల ఆయన పదేళ్ల క్రితమే మరణించాడు. అప్పటి నుంచి కుటుంబాన్ని శ్రీదేవి సోదరుడే నడిపిస్తున్నాడు. డిప్లొమా చేసిన శ్రీదేవి.. మొదట అమెరికన్ బెస్డ్ కంపెనీలో ఐటీ రిక్రూటర్గా పని చేసింది. అదే సమయంలో ఇంజనీరింగ్ కూడా కంప్లీట్ చేసింది శ్రీదేవి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa