ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీఆర్ఎస్ పార్టీని వీడటం బాధగానే ఉంది.. కాకపోతే..: కడియం మనసులో మాట

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 02, 2024, 07:44 PM

పార్లమెంట్ ఎన్నికలకు మందు బీఆర్ఎస్ పార్టీకి షాకిస్తూ.. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కారుకు గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన కూతురు డాక్టర్ కడియం కావ్యతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇలా పార్టీలో చేరారో లేదో.. కాంగ్రెస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కావ్య పేరును ప్రకటించింది హస్తం పార్టీ. కడియం పార్టీ మార్పుపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో ఫైరవుతున్నారు. తమ పార్టీలో డిప్యూటీ సీఎం సహా.. అన్ని రకాల పదవులు కట్టబెడితే.. కష్టకాలంలో ద్రోహం చేసి వెళ్లిపోయారని మండిపడుతున్నారు.


ఈ నేపథ్యంలో పార్టీ మార్పుపై కాంగ్రెస్‌లో చేరిన తర్వాత తొలిసారిగా స్పదించారు కడియం శ్రీహరి. వరంగల్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన.. బీఆర్ఎస్ పార్టీని వీడటం కొంత బాధగానే ఉందని అన్నారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పట్ల తనకు ఇప్పటికీ గౌరవం ఉందని అన్నారు. అందుకే తాను ఆయనపై ఏ రకమైన విమర్శలు చేయదలచుకోలేదని చెప్పారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ తనకు అవకాశాలు ఇచ్చిందని.. వాటిని తాను సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోయాన్నారు.


ప్రస్తుతం రాజకీయ సమీకరణాలు మారిపోయాయని.. స్టేషన్ ఘన్‌పూర్ నియోజవర్గం అభివృద్ధి చెందాలంటే పార్టీ మారటం ఒక్కటే మార్గమని అన్నారు. అందుకే కారు దిగి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు చెప్పుకొచ్చారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలను నాశనం చేస్తోందన్నారు. ప్రతిపక్షంలో ఉండి అభివృద్ధి చేయలేనన్న ఆవేదన నాలో ఉందని అన్నారు. ఇక పార్టీ మార్పుపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలపై ఘాటుగా స్పదించారు కడియం. చాలా మంది పార్టీ మారినా.. బీఆర్ఎస్ నేతలు స్పందించలేదన్నారు. తన విషయంలో మాత్రం తీవ్రంగా స్పందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


సభ్యత, సంస్కారం మరిచి తనపై మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తాను వాళ్లలా దిగజారి మాట్లాడాలని అనుకోవట్లేదని చెప్పారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కావటం లేదన్నారు. ఎర్రబెల్లి అహంకారుపు, బలుపు మాటలు తగ్గించుకోవాలని హెచ్చరించారు. మనవరాలి వయసున్నామె చేతిలో ఎర్రబెల్లి ఓడిపోయారని దుయ్యబట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa