తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 2 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 52 శాతం పోలింగ్ నమోదైంది. పట్టణాల కంటే పల్లెల్లోనే ఎక్కువగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ స్టేషన్ల ముందు బారులు తీరారు. అయితే కొన్ని చోట్ల ప్రజలు పోలింగ్ను బహిష్కరిస్తున్నారు. ఏళ్లుగా తమ సమస్యలు పరిష్కారం కావటం లేదని.. సమస్యలు పరిష్కరిస్తేనే ఓటేస్తామని మెుండికేస్తున్నారు.
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం అమరగిరి చెంచుగూడెంలో స్థానిక ప్రజలు పోలింగ్ను బహిష్కరించి ఆందోళన చేపట్టారు. ఈ గ్రామంలో 150 మంది ఓటర్లు ఉండగా.. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఓటేసిది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. గత మూడ్రోజులుగా తమ గ్రామంలో కరెంట్ ఉండటం లేదని.. తరుచూ విద్యుత్ అధికారులు కరెంట్ కట్ చేస్తున్నట్లు వాపోయారు.
10 రోజులు కరెంట్ ఉంటే మరో మూడ్రోజులు కరెంట్ తీసేస్తున్నారన్నారు. బిల్లులు చెల్లించం లేదని కరెంట్ ఫీజులు తీసేస్తున్నారని.. మారుమూల బ్రతికే తాము లక్షల్లో బిల్లులు ఎలా కడతామని ప్రశ్నిస్తున్నారు. కరెంట్ లేకపోవటంతో ఇళ్లల్లోకి పాములు వస్తున్నాయని.. వెన్నెల వెలుగుల్లోనే కాలం వెల్లదీస్తున్నామని అంటున్నారు. ఎండా కాలం కరెంట్ లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో అందరికే తెలిసిందేగా అని చెబుతున్నారు. తమకు చిన్న పిల్లలు ఉన్నారని.. కరెంట్ లేకుంటే ఇబ్బందులు పడుతున్నారని వాపోతున్నారు. చెంచులమనే చిన్నచూపుతునే తమను ఏ రాజకీయ నాయకుడు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటింగ్కు ఇంకా సమయం ఉందని.. తమకు స్పష్టమైన హామీ ఇస్తేనే ఓట్లు వేస్తామని అమరగిరి చెంచుగూడెం గ్రామస్తులు తెగేసి చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa