ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో ముగిసిన ఎన్నికలు.. హైదరాబాద్‌ మెట్రోకు కొత్త ఉత్సాహం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, May 14, 2024, 08:14 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమరం ముగిసింది. 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు సోమవారం పోలింగ్ జరగ్గా.. రాత్రి పొద్దుపోయేదాకా ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఇక ఏపీ ఓటర్లు చాలా మంది హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. ఉద్యోగాలు, ఉపాధి, చదువుల నిమిత్తం హైదరాబాద్‌లో ఉంటున్నారు. వీరంతా ఓటేసేందుకు స్వస్థలాలకు వెళ్లారు. ట్విన్ సిటీస్‌లో దాదాపు 30 లక్షల మంది ఏపీవాసులు ఉండగా.. వారిలో మెజార్టీ ప్రజలు ఓటేసేందుకు వెళ్లారు. ఓటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత వారంత నగరానికి తిరుగు ప్రయాణమయ్యారు.


బస్సుల్లో వెళ్లిన చాలా మంది రిటర్న్ టికెట్ బుక్ చేసుకోవడంతో ఇవాళ తెల్లవారుజామునే నగరానికి చేరుకున్నారు. ఎల్బీనగర్ వరకు బస్సుల్లో వచ్చి అక్కడ్నుంచి మెట్రోను ఆశ్రయిస్తున్నారు. దీంతో మెట్రోలో రద్దీ విపరీతంగా పెరిగింది. ఈ క్రమంలోనే ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఉదయం 5.30 గంటల నుంచే మెట్రో రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. విజయవాడ నుంచి హైరదాబాద్ వచ్చే ప్రయాణికులకు మొదటి చెక్ పాయింట్ ఎల్బీ నగర్ కావడంతో ప్రయాణికులు స్వస్థలాలకు చేరుకునేందుకు మెట్రో ట్రైన్లు ఆశ్రయిస్తున్నారు.


దీంతో ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ వైపు వెళ్లే మెట్రోలో రద్దీ విపరీతంగా పెరిగింది. సాధారణంగా ఉదయం వేళల్లో రద్దీ తక్కువగా ఉండేది. ఇవాళ మాత్రం ఫస్ట్ ట్రైన్ నుంచే కాలు పెట్టే సందు లేకుండా మెట్రో ట్రైన్ కిక్కిరిపోయింది. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా వీలైనన్ని ఎక్కువ ట్రిప్పులు నడపాలని మెట్రో అధికారులు యోచిస్తున్నారు. కాగా, ఇటీవల కాలంలో మెట్రోకు రద్దీ తగ్గింది. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితం ప్రయాణం అందించటంతో చాలా మంది బస్సుల్లో ప్రయాణాలు సాగిస్తున్నారు. మెట్రోలో ప్రయాణాలు చేయటం లేదు. దీంతో మెట్రోలో రద్దీ తగ్గింది. రద్దీ లేకపోటవంతో మెట్రో అమ్మకానికి ఉందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ఎన్నికల పుణ్యాన మెట్రోకు కొత్త ఉత్సాహం వచ్చింది.కాగా, మరికొందరు ట్రైన్లు, ప్రైవేటు వెహికల్స్‌లో నగరానికి చేరుకుంటున్నారు. దీంతో హైదరాబాద్- విజయవాడ రహదారిపై పంతంగి టోల్ గేట్ వద్ద వాహనాలు బారులు తీరాయి. కి.మీ మేర వాహనాలు నిలిచిపోగా..వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్‌ ఉండటంతో త్వరగా స్కానింగ్‌ చేసి పంపిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa