సమాజంలో ప్రస్తుతం రకరకాల మోసాలు వెలుగు చూస్తున్నాయి. ఈజీ మనీకి అలవాటుపడిన కొందరు అమాయకులే టార్గెట్గా చీట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆన్లైన్లో ఆర్డర్ చేసిన వస్తువులకు బదులుగా.. సబ్బులు, రాళ్లు పంపించి మోసాలు చేసిన ఘటనలు చూశాం. తాజాగా.. ఆఫ్లైన్ అంటే ప్రత్యక్షంగానూ ఇటువంటి మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ మహిళ అటువంటి మోసానికి గురైంది. తాను మోసపోయిన తీరును వివరిస్తూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేయగా.. అది వైరల్గా మారింది.
వివరాల్లోకి వెళితే.. ఓ మహిళ ( వివరాలు తెలియవు) ఇటీవల ట్రైన్ జర్నీ చేసింది. జర్నీ సమయంలో ఓ వ్యక్తి ట్రైన్లోనే మెుబైల్ పవర్ బ్యాంకులు విక్రయిస్తున్నాడు. తన ఫోన్ కూడా అవసరం పడుతుందనుకొని అతడి వద్ద రూ. 700 పెట్టి పవర్ బ్యాంక్ కొన్నది. బ్రాండెడ్ కంపెనీ పవర్ బ్యాంక్లు తక్కువ ధరకే ఇస్తున్నామని చెప్పి సదరు వ్యక్తి దాన్ని విక్రయించాడు. మెుబైల్కు కనెక్ట్ చేయగా.. కొన్ని గంటల వరకు బాగానే ఉంది. ఆ తర్వాత ఇంటికి వచ్చిన మహిళ మరోసారి ఛార్జ్ చేద్దాం అని చూడగా.. అది పని చేయలేదు.
ఏదో తేడా కొడుతుందే అని దాన్ని విప్పి చూడగా.. ఫ్యూజులు ఎగిరిపోయే సీన్ కనిపించింది. ఓ చిన్న బ్యాటరీని పవర్ బ్యాంకులో అమర్చి బరువుగా ఉండేందుకు మైదా పండి వంటి పదార్థాన్ని దానిలో ఉంచారు. అది చూసి మహిళ మోసపోయానని గ్రహించింది. తనలా మరొకరు మోసపోకూడదని ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆమె షేర్ చేసిన వీడియోకు నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.
'చపాతి పిండి కొంటే.. పవర్ బ్యాంక్ ఉచితం అన్నట్లు ఉంది. పాపం మోసపోయారు' అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ఇలాంటి మోసాన్నే తానూ ఎదుర్కొన్నట్లు మరో నెటిజన్ గోడును వెల్లబోసుకున్నాడు. అది పవర్ బ్యాంకు కాదని.. చపాతీ పిండి బ్యాంక్ అని మరో నెటిజన్ ఫన్నీగా కామెంట్ పెట్టాడు. చివరగా బయట ఏదైనా వస్తువుకొనే ముందు జాగ్రత్తగా ఉండాలి. బ్రాండెడ్ వస్తువు తక్కువ ధరకే వస్తుందని చెబితే కచ్చితంగా ఆలోచించాలి. ఎందుకంటే ఖరీదైన వస్తువులు తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన అవసరం ఎవరికీ ఉండదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa