ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజలను రోగాల బారిన పడేస్తున్న ఆదర్శనగర్ డంపింగ్ యార్డ్ ను ఎత్తేయాల్సిందే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 21, 2024, 03:39 PM

శ్వాసకోశ చర్మ సంబంధ వ్యాధులకు కారణం అవుతున్న ఆదర్శనగర్ డంపింగ్ యార్డ్ ను ఎత్తివేయాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం కాప్రా మండల తహసిల్దార్ సుచరిత తో కలిసి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆదర్శనగర్ డంపింగ్ యార్డును సందర్శించారు.నిబంధనలకు విరుద్ధంగా రామ్కీ సంస్థ ఆధ్వర్యంలో ఆదర్శనగర్లో కొనసాగుతున్న డంపింగ్ యార్డును ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ 20 కాలనీల కుటుంబాలు చేస్తున్న ఆందోళనకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలను రోగాల బారిన పడేలా రామ్ కి సమస్త ప్రతిరోజు ఇష్టానుసారంగా ఆదర్శనగర్లో లారీలకొద్దీ చెత్తను డంపు చేయడం క్షమించరాని విషయం అన్నారు.
ఆదర్శనగర్ డంపింగ్ యార్డ్ కు చెత్తను తీసుకురావడం తక్షణమే నిలిపివేయాలని రామ్కీ  ప్రతినిధులను హెచ్చరించారు. చెత్త లారీలను నిలుపుదల చేయకపోతే ప్రజలతో మమేకమై ఆందోళనను ముమ్మరం చేస్తామని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు జమ్మిగడ్డ ఆదర్శనగర్ చర్లపల్లి కాలనీల సమాఖ్య సిసిఎస్, ప్రతినిధులు ఎంపల్లి పద్మా రెడ్డి, కాసం మైపాల్ రెడ్డి, నేమూరి మహేష్ గౌడ్, బిఏ నవీన్ గౌడ్, బద్రుద్దిన్ ,రామకృష్ణ, నరేందర్ రెడ్డి, సప్పిడి శ్రీనివాస్ రెడ్డి, ఎస్ ఏ రహీం, కొండూరి మురళి పంతులు, షేర్ మణెమ్మ, శోభారాణి, కల్పన, సుజాత, యాదగిరి, సింగిరెడ్డి దేవేందర్ రెడ్డి, నవీన్, గంప కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa