ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మెట్రో కీలక నిర్ణయం.. గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా 17న అర్ధరాత్రి 2 గంటల వరకు రైళ్లు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 15, 2024, 07:25 PM

గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 17న అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో రైళ్లు నడుస్తాయని సంస్థ వెల్లడించింది. చివరి స్టేషన్‌లో నుంచి రాత్రి ఒంటిగంటకు చివరి రైలు బయలుదేరుతుందని పేర్కొంది.
నిమజ్జనం ముగిసే వరకు అవసరాన్ని బట్టి అదనపు రైళ్లు నడుపుతామని తెలిపింది. కాగా, నిన్న ఒక్క రోజే ఖైరతాబాద్‌ మెట్రో స్టేషన్‌ను 94 వేల మంది ప్రయాణికులు వినియోగించుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa