ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాగర్ కర్నూల్ జిల్లా ఆస్పత్రికి ప్రత్యేక అతిథులు,,,,పేషెంట్లు.. మరీ ఇంత దరిద్రమా..?

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 21, 2024, 07:25 PM

సాధారణంగా ఆస్పత్రికి రోగులు.. వారితో పాటు వారి కుటుంబ సభ్యులో, స్నేహితులో వస్తుంటారు. కానీ.. ఈసారి ఆస్పత్రికి ప్రత్యేక అతిథులు వచ్చారు. మరి ఆ ప్రత్యేక అతిథులు.. డాక్టర్లకు చూపించుకునేందుకు వచ్చారో.. లేదా ఆస్పత్రి సిబ్బంధి సరిగ్గా విధులు నిర్వర్తిస్తున్నారా లేదా అని పర్యవేక్షించేందుకు వచ్చారో కానీ.. మొత్తానికి అందరూ గజగజా వణికిపోయారు. అదేంటీ.. విశేషమైన అతిథులొస్తే ఆనంద పడటమో.. ఆశ్చర్యపోవటమో చేయాలని కానీ.. భయపడటమేంటీ అనేగా మీ డౌటనుమానం.. ఆ ప్రత్యేక అతిథులు ఎవరో కాదు వీధి కుక్కలు. అవును మరీ.. నాగర్ కర్నూల్‌లోని జిల్లా ఆస్పత్రిలో వీధి కుక్కల గుంపు ఆస్పత్రిలోకి వచ్చి.. అందరినీ భయపెట్టాయి.


శుక్రవారం (సెప్టెంబర్ 20న) ఉదయం.. జనరల్‌ ఆస్పత్రి ప్రాంగణంలో.. వీధి కుక్కలు యథేచ్చగా విహరించాయి. సాధారణంగా కుక్కలు.. ఆస్పత్రి బయట ఉన్న ప్రాంగణంలో చెట్ల కింద చల్లగా పడుకుంటూ సేదతీరుతుంటాయి. కానీ.. ఇక్కడ మాత్రం.. సుమారు ఆరు నుంచి ఏడు వీధి కుక్కలు.. నేరుగా ఆస్పత్రిలోకి టీవీగా నడుచుకుంటూ వచ్చాయి. గుంపుగా వచ్చిన కుక్కలు.. ఆస్పత్రి ఓపీ ముందు చాలాసేపు సంచరించాయి. చాలా సేపు ఓపీ గది ముందు బైఠాయించాయి. అనంతరం ఆసుపత్రి ఆవరణలో కలియ తిరుగుతూ రోగులను, వారి అటెండర్లను తీవ్ర భయాందోళనకు గురిచేశాయి.


ప్రస్తుత పరిస్థితుల్లో.. సాధారణంగా ఒక్క కుక్క కనిపిస్తేనే జనాలు గజగజా వణికిపోతున్నారు. అలాంటిది.. ఒకేసారి ఆరు నుంచి ఏడు కుక్కల గుంపు ఆస్పత్రిలో చూడటంతో.. జనాలు భయాందోళనలకు గురయ్యారు. ఓ వ్యక్తి అయితే.. వాటిని చూసి బయటకు పరుగులు కూడా పెట్టాడు.


ఇంత జరుగుతుంటే.. ఆసుపత్రి సిబ్బంది మాత్రం కుక్కల గుంపును ఏమాత్రం పట్టించుకోకపోవటం ఆశ్చర్యం కలిగించే విషయం. ఆస్పత్రి లోపలికి వచ్చిన కుక్కలను వెళ్లగొట్టకపోవడంతో సిబ్బందిపై రోగులు, వారి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక జిల్లా ఆస్పత్రిలో ఇంత దరిద్రమైన నిర్వాహణ ఉంటుందా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇది కాస్త వైరల్ అవుతుండటంతో.. అధికారులు కూడా సీరియస్ అయినట్టు తెలుస్తోంది.


ఇదిలా ఉంటే.. వనపర్తి జిల్లా అమరచింతలోని శ్రీకృష్ణనగర్‌లో శుక్రవారం రోజునే వీధిలో అడుకుంటున్న చిన్నారులపై కుక్కలు దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. ఉదయం పూట స్కూల్‌కు వెళ్లే ముందు అభినాష్, అక్షయ్ కుమార్ ఇంటి ముందు ఆడుకుంటున్నారు. ఆ సమయంలో.. ఒక్కసారిగా వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa