ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మూసీ వద్దకు వెళ్లి ఫొటో తీసేందుకు ప్రయత్నించిన ఫొటోగ్రాఫర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 08, 2024, 09:34 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఫొటో తీస్తూ ఓ ఫొటోగ్రాఫర్ కాలుజారి మూసీ నదిలో పడిపోయాడు. మూసీ పునరుద్ధరణ యాత్ర ప్రారంభించడానికి ముందు సీఎం రేవంత్ రెడ్డి సంగెం శివయ్యకు పూజలు చేశారు. ఆ తర్వాత మూసీ నది వద్దకు వెళ్లి ఓ బాటిల్‌లో నీటిని తీసుకున్నారు.ఈ సమయంలో ఓ ఫొటో జర్నలిస్టు కాస్త ముందుకు వచ్చి సీఎంను ఫొటో తీసేందుకు ప్రయత్నించాడు. కానీ కాలు జారి మూసీ నదిలో పడిపోయాడు. ఆ పక్కనున్న వారు అతనిని పట్టుకున్నారు. సీఎం సెక్యూరిటీలోని ఓ పోలీస్ అధికారి కూడా ఆయనకు సాయం చేశారు.కాగా, యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం వద్ద ప్రారంభమైన యాత్రకు రైతులు, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ యాత్ర భీమలింగం వరకు కొనసాగింది. సీఎంతో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa