ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజా ప్రభుత్వంలో ప్రజల ఆరోగ్యానికే అధిక ప్రాధాన్యత గడ్డం అనూప్ రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 05, 2024, 03:54 PM

బుధవారం నల్గొండ లోని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ & సినిమాటోగ్రఫీ శాఖామంత్రి  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహకారంతో మంజూరైన  సీఎంఆర్ఎఫ్  రిలీఫ్ ఫండ్ చెక్కులను మంత్రి క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు  పంపిణీ చేశారు కనగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గడ్డం అనూప్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా ఆరోగ్యానికి సీఎం రేవంత్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని  అనూప్ రెడ్డి గారు అన్నారు. పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని పెద్ద మొత్తంలో సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికే దక్కుతుందన్నారు, నిరుపేద అభివృద్ధియే లక్ష్యంగా అనేక సంక్షేమాలను రూపకల్పన చేసి అమలు చేస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో అనేక సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ చేపట్టబోతుందని తెలిపారు.
సంక్షేమ పథకాలు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుందని, అప్లికేషన్ గడువును ఆరు నెలల నుండి సంవత్సరానికి పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే  అని తెలిపారు.  ఈ కార్యక్రమంలో కనగల్ మాజీ జెడ్పిటిసి సభ్యులు నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్ , మాజీ కనగల్ పి ఎస్ సి చైర్మన్ దేవి రెడ్డి వెంకట్ రెడ్డి ,  కనగల్ మండలం  యుత్ అధ్యక్షులు కూసుకుంట్ల రాజిరెడ్డి ,మాజీ సర్పంచులు  రమణారెడ్డి , నర్సింగ్ కృష్ణయ్య గౌడ్ , బాబురావు , బోగరి రాంబాబు,   కాంగ్రెస్ నాయకులు కొరివి శంకర్,  లక్ష్మీనారాయణ, అందుగుల వెంకటేశం, గౌని నరేష్ , దిలీప్ రెడ్డి ,  తదితరులు పాల్గొన్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa