యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తి విషయంలో కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బెంగళూరులో గురువారం ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక సీఎం సిద్దరామయ్యతోపాటు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయాల ధన సహాయ కమిషన్ వెలువరించిన నియమావళి గురించి నగరంలోని ఐటీసీ విండ్సర్ మానర్ హోటల్లో ప్రత్యేక సదస్సు నిర్వహించనున్నారు.
![]() |
![]() |