బీజేపీకి అన్నివర్గాల నుంచి ఆదరణ లభించిందని ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి శివన్నారాయణ తెలిపారు. అవినీతి అంతం అంటూ అధికారంలోకి ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చిందని.. కానీ ఆ అవినీతిలోనే కేజ్రీవాల్ కూరుకుపోయారని విమర్శించారు. యమున నది కాలుష్యం అంటూ బీజేపీపై విమర్శలు చేశారని.. కానీ ప్రజలు మాత్రం బీజేపీ భారతదేశం విలువలు పెంచిన పార్టీ అని తెలుసుకున్నారని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ సాధారణ పార్టీ అని చెప్పి... ఇక్కడ జగన్ ఏ విధంగా ప్యాలెస్లు కట్టుకున్నారో... ఢిల్లీలో కేజ్రీవాల్ కూడా అదే విధంగా వ్యవహారించారని ఆరోపించారు. అందుకే ఆప్ను ప్రజలు తిప్పి కొట్టారని శివన్నారాయణ పేర్కొన్నారు.
![]() |
![]() |