ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూట్యూబర్ హర్షసాయికి బిగ్ షాక్.. కేసు నమోదు

Crime |  Suryaa Desk  | Published : Sun, Mar 16, 2025, 10:32 PM

యూట్యూబర్ హర్షసాయి అంటే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుపరిచితుడే. గుడిసెల్లో ఉన్నవారికి డబ్బుల కట్టలతో సర్‌ప్రైజ్‌లు ఇస్తూ.. వారి కలలను నిజం చేస్తున్నట్టు వీడియోలు చేస్తూ హీరో రేంజ్ ఫాలోయింగ్ తెచ్చుకున్న ఫేమస్ యూట్యూబరే హర్షసాయి. ఆ మధ్య ఓ సినిమా కూడా అనౌన్స్ చేసి.. ఆ తర్వాత ఆగిపోవటమే కాదు.. అందులో నటింస్తూ నిర్మిస్తున్న హీరోయినే ఆతనిపై రేప్ కేసు పెట్టటం సర్వత్రా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. అయితే.. హర్షసాయికి ఇప్పుడు మరో బిగ్ షాక్ తగిలింది. హర్షసాయిపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.


హర్షసాయి బెట్టింగ్ యాప్స్‌ ప్రమోట్ చేస్తున్నాడంటూ కేసు నమోదు చేసినట్లుగా సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్. కాగా.. సజ్జనార్‌ ఖాతాలో హర్షసాయి మూడో వికెట్. సజ్జనార్‌ చేసిన పోస్టు ద్వారా.. ఇప్పటికే వైజాగ్ లోకల్ బాయ్ నానిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించగా.. భయ్యా సన్నీ యాదవ్‌ మీద కూడా కేసు నమోదైంది. కాగా.. హర్ష సాయి గతంలో ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియోను తాజాగా సజ్జనార్ పోస్టు చేయగా.. దాన్ని ఆధారంగా చేసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. హర్షసాయి గతంలోనే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు.


అయితే.. ఈ సందర్భంగా సజ్జనార్ కీలక పోస్టు చేశారు. అయితే తాను ఒంటరిగా ఎవర్నీ టార్గెట్ చేయడం లేదని.. ఒక సమాజంగా మనమంతా.. సోషల్ మీడియా ద్వారా బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న ఇన్‌ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్ల వ్యవస్థతో పోరాడుతున్నామని సజ్జనార్ చెప్పుకొచ్చారు. వారికి లక్షలాది మంది అనుచరులు ఉన్నా, వేలల్లో ఉన్నా.. ఇలాంటి ప్రమాదకరమైన యాప్స్‌ని ప్రమోట్ చేయటం వల్ల ప్రజలను తప్పుదారి పట్టించడమే కాకుండా, ఎన్నో జీవితాలను నాశనం చేసినవారవుతున్నారని వివరించారు.


ఈ బెట్టింగ్ యాప్‌ల వల్ల కేవలం ఆర్థికంగా నష్టం కలగటంమే కాదు.. ఇది మన దేశ భవిష్యత్తును క్రమంగా క్షీణింపజేస్తోందని సజ్జనార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఓవైపు భారతీయుల ప్రతిభ ప్రపంచానికే నాయకత్వం వహిస్తుండగా.. ఎంతో మంది యువత జీవితాలు సొంత దేశస్థుల ట్రాప్‌లో చిక్కుకుపోయి పట్టాలు తప్పుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యాప్‌లు కేవలం వ్యక్తిగత ప్రమాదం కాదని.. అవి సామాజిక, ఆర్థిక ముప్పు అని ఫలితంగా కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తాయని సజ్జనార్ హెచ్చరించారు. ఆలస్యం కాకముందే.. అప్రమత్తం కావాలని, బెట్టింగ్ యాప్స్ లాంటి ఫేక్ యాప్స్ కలిగించే నష్టాన్ని గుర్తించాలని సజ్జనార్ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com