ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉమ్మడి కడప జిల్లాలో పదోతరగతి ప్రశ్నపత్రం లీక్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 25, 2025, 08:52 PM

ఉమ్మడి కడప జిల్లాలో పదోతరగతి ప్రశ్నపత్రం లీక్. పేపర్ లీక్ వ్యవహారంలో ముగ్గురుని సస్పెండ్ చేసిన డీఈవో. సస్పెండ్ చేసిన డీఈవోకు బెదిరింపులు. పదోతరగతి విద్యార్థులకు గణితం పరీక్ష ప్రారంభమైన కొద్ది నిమిషాల వ్యవధిలో వాట్స్‌యాప్లో దర్శనమిచ్చిన ప్రశ్నపత్రం . ఓ వ్యక్తి నేరుగా డీఈవో షంషుద్దీన్ కు సమాచారం చేరవేయడంతో ఆయన ఆ ప్రశ్నపత్రంలోని క్యూఆర్ కోడ్ ఆధారంగా వల్లూరు జిల్లాపరిషత్తు ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రం నుంచి ప్రశ్నపత్రం లీక్ అయినట్లుగా గుర్తింపు. వల్లూరు మండలంలో ఒకటి, వేంపల్లె మండలంలో రెండు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల అండతో ఈ ఘటన చోటుచేసుకుందని సమాచారం. పరీక్ష మొదలైన నిమిషాల వ్యవధిలో వల్లూరు పరీక్ష కేంద్రంలోకి వాటర్ బాయ్ సాయిమహేష్, విఘ్నేశ్వర రెడ్డి అనే ఉపాధ్యాయుడు వెళ్లి ప్రశ్నపత్రం ఫొటో తీసి, వాట్స్‌యాప్ ద్వారా వేంపల్లెలోని కొంతమంది ప్రైవేట్ పాఠశాల యాజ మాన్యాలకు చేరవేస్తున్నారని విచారణలో తేలినట్లు చెబుతున్నారు


పశ్నపత్రం లీకు వ్యవహారంలో చీఫ్ సూపరింటెండెంట్ ఎం.రామ కృష్ణమూర్తి, డిపార్ట్మెంటల్ అధికారి ఎన్. శ్రీనివాస్ రెడ్డి, ఇన్విజిలేటర్ ఎం. రమణ సస్పెండ్ చేసిన డీఈవో షంషుద్దీన్. దీంతో డీఈవోపై బెదిరింపులకు దిగిన పలువురు వ్యక్తులు.. పోలీసులు కేసు నమోదు చేయడం, విచారణ వంటి వాటిపై తాము రాజకీయంగా చూసుకుంటా మని, ఇంతటితో విద్యాశాఖ సైలెంట్ అవ్వాలని, లేకపోతే జిల్లావిద్యాశాఖ అధికారులే లక్ష్యంగా ముందుకెళతామని హెచ్చరికలు జారీచేసినట్లు సమాచారం






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com