కర్నూలు స్టేట్ క్యాన్సర్ హాస్పిటల్ ప్రారంభానికి ఏప్రిల్ 19న రానున్న రాష్ట్ర వైద్యఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ పర్యటనకు ఏర్పాట్లను వేగవంతం చేయాలని డీఎంఈ డాక్టర్ వెంకటేశ్వరరావు అధికారులను మంగళవారం ఒక ప్రకటనలో ఆదేశించారు. హాస్పిటల్, మెడికల్ కాలేజీని పరిశీలించి, వసతులు, పరికరాలపై సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు. అత్యవసరమైన వసతులు పరికరాలు సమస్యల నివేదిక తయారు చేసుకోవాలన్నారు.
![]() |
![]() |