ప్రభుత్వ ఉద్యోగులు మరియు కాంట్రాక్టర్లకు సంక్రాంతి కానుకగా డీఏ, వివిధ రకాల పెండింగ్ బిల్లులను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఆర్థిక శాఖ ఈ చెల్లింపుల కోసం రూ.2,653 కోట్లు నిధులు మంజూరు చేసింది. ఇందులో డీఏ, డీఆర్ ఎరియర్స్ కోసం రూ.1,100 కోట్లు, పోలీసులకు సరెండర్ లీవుల కోసం రూ.110 కోట్లు, ఈఏపీ, నాబార్డ్, సాస్కీ, సీఆర్ఐఎఫ్ పనులకు రూ.1,243 కోట్లు ఉన్నాయి. ఈ నిర్ణయంతో ఉద్యోగులు, కాంట్రాక్టర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa