ఇటీవల కాలంలో రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నో అసాంఘిక శక్తులు పాల్పడుతున్న దుశ్చర్యలకు కారణం అవుతున్న గంజాయి, మత్తు పదార్థాల వినియోగాన్ని, అమ్మకాలను నియంత్రించాలంటే విడివిడిగా ఉన్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ( సెబ్ ), ఎక్సైజ్ శాఖ లను విలీనం చేయాలని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నరసింహులు ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం గాంధీనగర్ లోని ఎన్జీవో హోం లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.