ట్రెండింగ్
Epaper    English    தமிழ்

11న పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తాం: కన్నా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 01, 2019, 02:19 PM

ఈ నెల 11న పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. గుంటూరులో జరిగిన రాష్ట్ర పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ నిర్ణయాలు రాష్ట్ర అభివృద్ధికి ఆటంకంగా మారాయని విమర్శించారు. పోలవరం నిర్మాణం పూర్తి చేయాలన్న తపన కనిపించట్లేదన్నారు. అనుయాయులు, పార్టీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇస్తున్నారని ఆరోపించారు. వాలంటీర్ల నియామకంలో ఉన్న తొందర, ఇసుక విషయంలో కొరవడిందన్నారు. కూలీలు నాలుగు నెలల నుంచి ఇబ్బంది పడుతున్నారన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa