ఏపీ సీఎం జగన్ కు మరో కొత్త తలనొప్పి వచ్చింది. ఇప్పటికే ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. కర్నూలులో జ్యూడిషియల్ క్యాపిటల్, అమరావతిలో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, వైజాగ్ లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అయితే రాయలసీమ ప్రాంత వాసులు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడాన్ని స్వాగతించినా తమ ప్రాంతం అభివృద్దికి నోచుకునే ప్రయోజనం లేదని వాపోతున్నారు.
కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసినంత మాత్రాన అభివృద్ది సాధ్యం కాదని అభిప్రాయపడుతున్నారు. ఎక్కువ ఇండస్ట్రీలు రావాలని, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. కర్నూలులో వింటర్ అసెంబ్లీ సమావేశాలతో పాటు మినీ సెక్రటేరియట్ ను ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. రాయలసీమ అభివృద్దికి చర్యలు తీసుకోకుంటే తాము ప్రత్యేక రాయలసీమ కోసం పోరాటం చేస్తామని సీమ వాసులు హెచ్చరిస్తున్నారు. మూడు రాజధానుల లొల్లి తీవ్రతరంగా మారుతుండడంతో సీఎం జగన్ కు కొత్త తలనొప్పులు వచ్చిపడుతున్నాయని పలువురు చర్చించుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa