ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చెన్నై టెస్టులో భారత్ ఘనవిజయం

national |  Suryaa Desk  | Published : Tue, Feb 16, 2021, 12:44 PM

చెన్నైలో భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో భారత్ విజయానికి ఒక వికెట్ దూరంలో ఉంది.ప్రస్తుతం భారీ లక్ష్యాన్ని వెంటాడుతున్న ఇంగ్లండ్ 126 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.భారత స్పిన్నర్లలో అక్షర్ పటేల్ 5 వికెట్లు పడగొట్టగా, అశ్విన్ 3, కులదీప్ యాదవ్ ఒక వికెట్ తీశారు.భారత్ విజయం కోసం ఇంగ్లండ్‌కు 482 పరుగుల లక్ష్యం ఇచ్చింది.భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులు చేసింది. ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 134 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్‌కు 195 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్ అద్భుత సెంచరీ వల్ల భారత్ 286 పరుగులు చేయగలిగింది. స్పిన్నర్లకు అనుకూలిస్తున్న చెన్నై పిచ్‌పై ఇంగ్లండ్‌కు 482 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇవ్వగలిగింది.సెకండ్ ఇన్నింగ్స్ ఇంగ్లండ్ పరిస్థితిరెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ వంద పరుగులకే కీలకమైన నాలుగు వికెట్లను కోల్పోయింది.


లారెన్స్ 26, బర్న్స్ 25 పరుగులకు అవుట్ అయ్యారు. లీచ్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరగా, సిబ్లీ మూడు పరుగులే చేయగలిగాడు.బెన్ స్టోక్స్ కూడా 8 పరుగులకే అవుట్ అయ్యాడు.116 పరుగుల దగ్గర బెన్ ఫోక్స్‌(2)ను మరో స్పిన్నర్ కులదీప్ యాదవ్ అవుట్ చేశాడు.లంచ్ తర్వాత అదే స్కోరు దగ్గర ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్(33) వికెట్ కోల్పోయింది.126 పరుగుల దగ్గర ఓలీ స్టోన్ డకౌట్ అయ్యాడు.సెకండ్ టెస్ట్ నాలుగో రోజే భారత్ విజయం సాధిస్తుందని భావిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa