ఆంధ్రప్రదేశ్లో మరో కీలక బడ్జెట్కు రంగం సిద్ధమవుతోంది. కరోనాలాంటి విపత్కర పరిస్థితుల నేపథ్యంలో.. లాక్డౌన్ కారణంగా రాష్ట్ర ఆదాయాలు తగ్గిన క్రమంలో వస్తోన్న బడ్జెట్ కావడంతో అందరి దృష్టి పడింది. ఇక రాష్ట్ర చరిత్రలో తొలిసారి ఏపీ ప్రభుత్వం తొలిసారి జెండర్ బేస్ బడ్జెట్ను ప్రవేశ పెడుతోంది. ఇందులో భాగంగానే మహిళలకు, పిల్లలకు ప్రాధాన్యత ఉండేలా బడ్జెట్ను రూపొందించింది.
ఈ క్రమంలోనే మరికాసేపట్లో రాష్ట్ర క్యాబినేట్ సమావేశం కానుంది. ఇక 2021-2022 ఆర్థిక ఏడాది వార్షిక బడ్జెట్ పరిమాణం రూ. 2.25 కోట్ల నుంచి రూ. 2.30 కోట్ల వరకు ఉండవచ్చని సమాచారం. ఈ కీలక బడ్జెట్ను మరికాసేపట్లో అసెంబ్లీలో బుగ్గన, మండలిలో హోం మంత్రి సుచరిత సమర్పించనున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రవేశపెడుతున్న మూడో బడ్జెట్ ఇది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి మూడు నెలలకు గాను రూ.70,983 కోట్ల మేర ఓటాన్ అకౌంట్కు గతంలోనే కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ఇపుడు పూర్తిస్థాయి బడ్జెట్ను అసెంబ్లీకి సమర్పించనున్నారు. ఇక ఈ ఏడాది బడ్జెట్లో వ్యవసాయం, విద్య, వైద్యం, సంక్షేమం, జల వనరులు, పేదలందరికీ ఇళ్ల నిర్మాణం.. తదితర అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa