ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు

national |  Suryaa Desk  | Published : Thu, May 20, 2021, 08:54 AM

 వ్యాక్సీనేషన్‌పై కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. నిపుణుల కమిటీ చేసిన సూచనలపై కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అనంతరం కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. కోవిడ్ నుంచి కోలుకున్నాక మూడు నెలల తర్వాత కరోనా టీకా వేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మొదటి డోస్ తీసుకున్నాక కరోనా వస్తే మూడు నెలల తర్వాత సెకండ్ డోస్ తీసుకోవచ్చని, తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారు టీకా కోసం నాలుగు నుంచి ఎనిమిది వారాల పాటు ఆగాలని పేర్కొంది. ఇక రక్తదానం గురించి స్పందిస్తూ ఆర్టీపీసీఆర్ నెగిటివ్ వచ్చిన 14 రోజుల తర్వాత రక్తదానం చేయవచ్చని పేర్కొంది. పాలిచ్చే తల్లులు టీకా తీసుకోవచ్చని సూచించిన కేంద్రం టీకా తీసుకునే ముందు రాపిడ్ యాంటిజన్ టెస్టులు అవసరం లేదని పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa