కిర్లంపూడి: కాపు నేత ముద్రగడ పద్మనాభం భారీ మద్దతుదారుల నడుమ మరోసారి ఆదివారం పాదయాత్రకు బయలుదేరడం కిర్లంపూడిలో తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. కాపులకు బీసీ రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ గత కొన్నిరోజులుగా పాదయాత్ర చేసేందుకు ముద్రగడ చేస్తున్న ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం కూడా ఇంటినుంచి బయటకు వెళ్లకుండా ముద్రగడను పోలీసులు మొదట అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు సర్కారుపై నిప్పులు చెరిగారు. కాపు ఉద్యమంపై చంద్రబాబు ఎందుకు ఉక్కుపాదం మోపుతున్నారని నిలదీశారు. అనంతరం కొద్దిసేపటికే ముద్రగడకు మద్దతుగా పెద్దయెత్తున కాపు నేతలు, అనుచరులు తరలివచ్చారు. దీంతో పోలీసులను తోసేసి.. వారి నిర్బంధాన్ని దాటుకొని మరీ ఇంటి నుంచి ముద్రగడ పాదయాత్రకు బయలుదేరారు. ముద్రగడ వెంట భారీగా మద్దతుదారులు ఉండటంతో పోలీసులు కూడా చేతులు ఎత్తేశారు. దీంతో ముద్రగడ 'ఛలో క్లిరంపూడి'కి పిలుపునిచ్చారు. తన మద్దతుదారులంతా కిర్లంపూడి రావాలని, అక్కడి నుంచి 'ఛలో అమరావతి' పాదయాత్ర చేపడుదామని ముద్రగడ తన అనుచరులకు సూచించారు. భారీ మద్దతుదారుల నడుమ ఆయన పాదయాత్రగా రాజుపాలెం చేరుకున్నారు. సీఎం చంద్రబాబునాయుడు కాకినాడలో పర్యటిస్తున్న సమయంలోనే ముద్రగడ పోలీసుల నిర్బంధాన్ని దాటుకొని పాదయాత్ర ప్రారంభించడం కిర్లంపూడిలో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. భారీ మద్దుతుదారుల నడుమ ఆయన పాదయాత్రగా వెళుతుండటంతో పోలీసులు ఆయనను అడ్డుకునే అవకాశముందని తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa