ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి నివారణకు జగన్ ప్రభుత్వం మళ్లీ మార్గదర్శకాలను విడుదల చేసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించని వారికి రూ. 1000 జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఈ నేపథ్యంలో ఏపీ వ్యాపారులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ముసుగులు ధరించని వ్యక్తులను దుకాణాలు, వాణిజ్య స్థలాలు, వ్యాపార స్థలాల్లోకి అనుమతిస్తే యజమాని నుంచి రూ. 10 వేల నుంచి రూ. 25,000 జరిమానా విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉల్లంఘనలు జరిగిన వ్యాపార, వాణిజ్య సంస్థలను 2 రోజుల పాటు మూసివేసేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. దుకాణాలు, వాణిజ్య, వ్యాపార సంస్థల్లో ఉల్లంఘనలపై వాట్సాప్ ద్వారా 8010968295 నంబర్కు ఫిర్యాదు చేయాలని ప్రభుత్వం వినియోగదారులను ఆదేశించింది. ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘనలకు పాల్పడితే ఐపీసీ సెక్షన్ 188 కింద కేసులు నమోదు చేస్తామని డిజాస్టర్ మేనేజ్మెంట్ వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa