ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేయాలి : సీతారాం ఏచూరి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 27, 2021, 02:10 PM

భాజపా వ్యతిరేక పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేస్తేనే. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలమని..సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఇందుకు వైకాపా సర్కారు కూడా చొరవ తీసుకోవాలన్నారు. దిల్లీలో కేంద్ర ప్రభుత్వాన్ని సమర్థించి రాష్ట్రంలో వ్యతిరేకించడం సరికాదని హితవు పలికారు. అమరావతిలో మూడ్రోజుల పాటు జరుగుతున్న సీపీఎం 26వ రాష్ట్ర మహాసభల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుపరం చేయడం, కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాయడం తప్పిస్తే. మోదీ ప్రభుత్వం చేసిందేమీ లేదని ఏచూరి విమర్శించారు. విభజన హామీలను అమలు చేయడంలోనూ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఆక్షేపించగా జగన్ ప్రభుత్వం భాజపాతో లాలూచీ రాజకీయాలు చేస్తుందన్నారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa