దేశంలో ఈ ఏడాది 77 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం పూర్తికానుంది. 2022లో 77 మంది రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్నట్లు రాజ్యసభ సచివాలయం తెలిపింది.ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురు, తెలంగాణ నుంచి ఇద్దరు ఎంపీల పదవీకాలం ముగియనుంది. 2022, జూన్ 21 నాటికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీలు సురేష్ ప్రభు, సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్, విజయసాయిరెడ్డి పదవీకాలం ముగియనుంది. తెలంగాణ నుంచి ఎంపీలు లక్ష్మీకాంతరావు, డి.శ్రీనివాస్ల పదవీకాలం ముగియనుంది.
కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, పీయూష్ గోయల్ వంటి ప్రముఖుల పదవీ కాలం ముగియనుంది. ఖాళీ కానున్న స్థానాలు తిరిగి వైసీపీ, టీఆర్ఎస్ కే దక్కనున్నాయి. ఏపీ నుంచి విజయసాయిరెడ్డి యథాతథంగా కొనసాగే అవకాశం ఉంది. మరో మూడు స్థానాల్లో కొత్తవారికి అవకాశం ఇవ్వనున్నట్లు కనిపిస్తోంది. టీఆర్ఎస్ నుంచి కొత్తవారిని రాజ్యసభకు పంపే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa