ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫిబ్రవరి 15 నుంచి ఆఫ్ లైన్లో సర్వదర్శన టిక్కెట్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 14, 2022, 12:51 AM

ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ఆఫ్‌‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన క్రమంలో భక్తులకు గుడ్ న్యూస్ అందించింది. ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ఆఫ్‌‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్లు టీటీడీ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. గతేడాది డిసెంబర్లో కోవిడ్‌ మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఆఫ్‌‌లైన్‌ టికెట్ల జారీ ప్రక్రియను టీటీడీ నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో కోవిడ్‌ వ్యాప్తి పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15 నుంచి ఆఫ్‌లైన్‌ టికెట్ల జారీ ప్రక్రియను పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఈ నెల 16వ తేదీన సర్వదర్శనం కోసం 15వ తేదీ ఉదయం 9 గంటలకు టోకెన్లు జారీ ప్రక్రియ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్‌, శ్రీనివాసం కాంప్లెక్స్‌, శ్రీ గోవిందరాజస్వామి సత్రాల్లో ఏర్పాటు చేసే కౌంటర్ల ద్వారా శ్రీవారి దర్శన టోకెన్లు జారీ చేయనున్నారు. కాగా, ఏపీలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా రోజు వారీ కేసులు వెయ్యిలోపే నమోదవుతున్నాయి. దీంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa