ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భాగ్యనగరిలో‌ యూరప్​ సెట్స్...

cinema |  Suryaa Desk  | Published : Mon, Jun 29, 2020, 05:23 PM

ప్రభాస్ హీరోగా యంగ్ డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ మూవీ రూపొందుతోంది. యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణ మూవీస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే జార్జియా, ఇటలీ తదితర ప్రాంతాల్లో కీలక షెడ్యూల్స్‌ను కంప్లీట్ చేశారు. ఇప్పుడు మిగిలిన షూటింగ్ పార్ట్ కోసం హైదరాబాద్‌లోనే ఫేమస్ ప్రొడక్షన్‌ డిజైనర్‌ ఆర్‌.రవీందర్‌ రెడ్డి నేతృత్వంలో స్పెషల్ సెట్స్ రెడీ చేస్తున్నారు. తాజాగా దీనిపై ఆర్‌.రవీందర్‌ రెడ్డి కొన్ని విశేషాలు తెలియపరిచారు.. ఈ  చిత్రం కోసం హైదరాబాద్‌లో ఇటలీ అందాల్ని పునఃసృష్టిస్తున్నారు. జూన్‌, జూలై నెలల్లో ఇటలీ, ఆస్ట్రియాలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించాలని చిత్రబృందం భావించింది. అయితే కరోనా ప్రభావంతో విదేశాల్లో షూటింగ్‌కు అవకాశాలు లేకపోవడంతో హైదరాబాద్‌లో  సుమారు ఐదు కోట్ల రూపాయల వ్యయంతో ఓ ప్రత్యేకమైన హాస్పిటల్‌ సెట్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. 1970-80 కాలం నాటి ఇటలీ అందాల్ని యథాథతంగా ఆవిష్కరిస్తూ ఆర్ట్‌ డైరెక్టర్‌  రవీందర్‌ ఈ సెట్‌ను సిద్ధం చేస్తున్నారని సమాచారం. ఆగస్ట్‌ ప్రథమార్థంలో ఈ సెట్స్‌లో ప్రభాస్‌, పూజాహెగ్డేతో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని చిత్రీకరించనున్నట్లు సమాచారం. ఈ సినిమాకు ‘రాధేశ్యామ్‌' అనే టైటిల్‌ ఖరారు చేయబోతున్నట్లు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa