బాలీవుడ్ లో బంధుప్రీతి ఎలియాస్ నెపోటిజంపై చర్చ ఇంకా ఒక స్పష్టత వచ్చినట్లు కనిపించటం లేదు ఇప్పటిలో వస్తుంది అనే నమ్మకం కూడా లేదు. ఈ సమస్య ఈనాటిది కాదు అయితే ఇది ఇప్పుడు ఇది ఎందుకు ఇంతలా చర్చ జరుగుతుంది అంటే ఒక షో లో కంగనా రనౌత్ అన్నమాటతో చాలమంది నటులు లోపల ఎప్పటినుండో గూడు కట్టుకొన్న ఆలోచనకు ఆజ్యం పోసినట్లయ్యింది. దానితో ఇలా దొరికిన ప్రతి వేదికలపై చర్చలు జరిగిపోతున్నాయి. అయితే ఇప్పుడు ఈ చర్చకు పింక్ సుందరి తాప్సీ పన్ను కూడా జతకట్టింది.
పింక్ చేస్తున్నప్పుడు తాప్సీ చేతిలో జూడ్వా2 సినిమా ఆఫర్ వచ్చి ఉంది. అలాగే సునిల్ శెట్టి కొడుకు అహన్ హీరోగా పరిచయం కాబోతున్న సినిమాలో కూడా తాప్సీ హీరోయిన్ గా చేయబోతుంది అనే వార్తలు కూడా వచ్చాయి. అంతా బాగానే ఉంది అనుకున్న సమయం లో గత డిసెంబర్ లో తాప్సీ ఒక ట్వీట్ చేసింది. పింక్ సినిమా చేసిన తరువాత ఆమె ట్వీట్ ఏంటంటే “నెపోటీజం అనే పదానికి అర్ధం తెలుసుకున్నాను. ఇప్పుడు దానితో ఎలా కలిసి నడవాలో నేర్చుకుంటాను” అని చెప్పింది. అయితే ఇది ఇండస్ట్రి పై ఆమె అభిప్రాయమా లేక ఆమె అనుభవమా అనేది ఒక స్పష్టత రాలేక ఆమె వరుణ్ ధావన్ ను కానీ సునిల్ శెట్టి కొడుకు అహన్ గురించి కానీ ఉద్దేశించి పెట్టి ఉండాలి అని పుకారు పుట్టించారు. అయితే ఆ ట్వీట్ కి ఇప్పుడు తాప్సీ వివరణ ఇచ్చింది
“ఎందుకు జనాలు ఇలా ఆలోచిస్తున్నారో నాకు అర్ధం కావటంలేదు. నేను ఎవరిని ఉద్దేశించి ఆ ట్వీట్ పోస్ట్ చేయలేదు.అసలు వరుణ్ నాన్న డేవిడ్ ధావన్ నన్ను బాలీవుడ్ కి పరిచయం చేశారు చష్మే బద్దూర్ (2013) తో. ఇప్పుడు జూడ్వా2 సినిమాలో కూడా పని చేస్తున్న ఆయనతో. కాబట్టి నేను వరుణ్ గురించి అన్నాను అని ఎందుకు అనుకున్నారు అంటుంది. అలాగే అసలు అహన్ తో సినిమా ప్రాజెక్టు మొదలు అవుతుంది అని కూడా నాకు తెలియదు మరి అలాంటి అప్పుడు అతనిని ఇందులోకి ఎందుకు లాగుతున్నారు మీరు?'' అని కోపంగా చెప్పింది. నేను ఒక ట్వీట్ ను రాయడానికి రిసర్చ్ చేసి పోస్ట్ చేయను అంటూ కామెంట్ చేసింది. కాకపోతే బాలీవుడ్లో నెపోటిజం పాతుకు పోయిందని.. దానిని ఏం చేయలేమని కూడా చెప్పేసిందీ రింగులు జుత్తు గంగ.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa